చిత్తూరు నగరంలోని మెసానిక్ మైదానంలో నీళ్ల సంపు గత కొన్ని రోజులుగా తెరిచి ఉంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మైదానానికి పంపాలంటే ఆందోళన చెందారు. ఈ విషయం నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ కు తెలియడంతో వెంటనే ఆయన స్పందించారు. దానిని మూసి వేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.