ప్రజా సమస్యలను అధికారులు బాధ్యతగా పరిష్కరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శుక్రవారం చిత్తూరులోని ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలపై 66 ఫిర్యాదులు అందాయి. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మేయర్ అముదా, కమిషనర్ నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు.