ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు శనివారం చిత్తూరుకు రానున్నట్లు ఎంపీ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. హైదరాబాద్ నుండి బయలుదేరి రేపు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు చేరుకుంటారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చని వారు తెలిపారు.