చిత్తూరు నగరంలోని ఆదివారం జరిగిన నోబెల్ టీచర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారికి సంఘ నాయకులు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సమాజంలో మార్పు తేవాలని, విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. సిఆర్ రాజన్, సంఘ నాయకులు పాల్గొన్నారు.