విద్యా శాఖలో నెలకొన్న సమస్యలపై ఈనెల 12వ తేదీన డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు యుటిఎఫ్ నాయకులు తెలిపారు. శుక్రవారం డీఆర్ మోహన్ కుమార్, డీఈవో వరలక్ష్మిని కలిసి ముందస్తు నోటీసు అందజేశారు. బదిలీలు, పదోన్నతులు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ, ఉపాధ్యాయుల సర్దుబాటులో సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్థ రాష్ట్ర నేత రమణ కోరారు.