చిత్తూరు నగరంలోని పాత డీపీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎస్పీ మణికంఠ ఆదివారం తెలిపారు. ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.