చిత్తూరు జిల్లాలో నిర్బంధ వెట్టిచాకిరి బలి అవుతున్న కూలీలకు విముక్తి కలిగించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్బంధ వెట్టిచాకిరీ కూలీ విధానం నిర్మూలనపై జేసీ విద్యాధరితో కలసి సంబంధిత అధికారులు, రోప్స్ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.