చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం కమిషనర్ నరసింహ ప్రసాద్ అధ్యక్షతన టీడీఆర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా కమిటీ సభ్యులు టీడీఆర్ జారీ అంశంపై చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రికార్డులను పరిశీలించి, టీడీఆర్ జారీపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను సూచించారు.