

సరస్వతి నవరత్న హారతిని వీక్షించిన సీఎం (వీడియో)
TG: భూపాలపల్లి(D) కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భాగంగా కాశీ పండితులు 45 నిమిషాల పాటు సరస్వతి నవరత్న హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి హారతి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.