చిత్తూరు జిల్లాల్లోని పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల కల్పన, కొరత, విద్యాబోధన, హాజరు తదితర అంశాలపై తానే విద్యార్థులకు ఫోన్చేసి మాట్లాడి తెలుసుకుంటానని కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ, తరచూ పాఠశాలలు తనిఖీ చేయాలని, స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. విద్యార్థుల ఫోను నెంబర్లను సేకరించాలని సూచించారు. నిల్వవున్న స్టూడెంట్ కిట్లను వెంటనే అందించాలన్నారు.