చిత్తూరు జిల్లాలోని రైతు బజార్లతో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో కందిపప్పు, బియ్యం తక్కువ ధరకే నేటి నుంచి విక్రయించనున్నారు. ఈ మేరకు బుధవారం జేసీ శ్రీనివాసులు కలెక్టరేట్లో అధికారులు, ధాన్యాలు, బియ్యం, నూనె, కందిపప్పు హోల్సేల్ డీలర్లతో సమావేశమయ్యారు. కందిపప్పు కిలో రూ. 160, బీపీటీ సోనామసూరి కిలో రూ. 48, రూ. 49కి అందిస్తున్నామన్నారు.