ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందనివాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది. నెల్లూరు,చిత్తూరు, కందుకూరు, బోగోలు, కావలిలో ఈదురుగాలులు, వర్షం నమోదు అయ్యాయి. ఫ్లెక్సీలు రోడ్డుపై పడిపోయాయి. పెనుగాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలవకూడదని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు సంస్థ సూచించింది.