గుట్టు చప్పుడు కాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను శనివారం గంగవరం పోలీసులు సీజ్ చేశారు. మండలంలోని మేలుమయి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి మబ్బువాళ్ళపేట సమీపంలోని కౌండిన్య నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.