పలమనేరు పట్టణంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలమనేరు పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. జెవిలి వీధిలో గతంలో మంజూరైన నూతన కాల్వ రామకృష్ణారెడ్డి కళాక్షేత్రం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.