తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 2వరోజు మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ముత్యపుకవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు. ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామివారికి ముత్యపుకవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపుకవచంలో భక్తులను అనుగ్రహించారు.