రాజధాని అమరావతి నిర్మాణానికి పుల్లూరు గ్రామస్థులు రూ. 45 వేలు విరాళం అందజేశారు. సీసీ మునీంద్రకు మంగళవారం నగదు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ. అమరావతి నిర్మాణానికి ప్రజలందరూ ముందుకు రావాలన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో అమరావతి త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. రాజధాని పూర్తయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.