చోరీ జరిగిన 24 గంటల్లోనే కార్వేటినగరం పోలీసులు దొంగను పట్టుకున్నారు. కార్వేటినగరం మండల కేంద్రంలోని ముస్లిం కాలనీలో దొంగతనం జరిగింది. దొంగను అరెస్ట్ చేసి 176 గ్రాముల బంగారం, 540 గ్రాముల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ సత్తిబాబు మంగళవారం తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.