చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం, పాతపాలెం గ్రామంలో ప్రభుత్వ రహదారి ఆక్రమణకు గురైందన్న విషయం గ్రామస్తులు ఎమ్మెల్యే థామస్ కు తెలిపారు. శనివారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆ సమస్యను స్థానిక తహసీల్దార్ తో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.