వారపు సంత కోసం శనివారం నిర్వహించిన వేలంతో జీడీనెల్లూరు పంచాయతీకి రూ. 3. 79 లక్షల ఆదాయం సమకూరింది. తలారి హరిబాబు వారపు సంత నగదు వసూళ్ల హక్కు దక్కించుకున్నారు. వేలంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యం యాదవ్, పంచాయతీ కార్యదర్శి అంజాద్ బాషా, ఈవోపీఆర్డీ రాఘవేంద్ర రాజు, వేలంపాట దారులు పాల్గొన్నారు.