జీడి నెల్లూరు మండలం, పెడకంటిపల్లి హరిజనవాడలో శుక్రవారం రాత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ మరియు జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. చిన్నచిన్న సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు చెప్పి ఎమ్మెల్యే పరిష్కరించారు.