జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ ను వెదురుకుప్పం మండల ఎంపీడీవో పురుషోత్తం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎంపీడీవోతో మాట్లాడుతూ మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.