జీడి నెల్లూరు: ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే

58చూసినవారు
జీడి నెల్లూరు: ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే
జీడీ నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం, బలిజకండ్రిగ హరిజనవాడ గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ప్రజలతో మమేకమయ్యారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్