జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దంపతులు పర్యటించారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పలువురు ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే కి అందించారు. ఆ సమస్యలకి వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.