జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, తయ్యూరు పశు వైద్య కార్యాలయంలో ఆదివారం మండల పశువైద్యాధికారిణి శ్రీవిద్య ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. పెంపుడు జంతువుల ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాధి నివారణ టీకాలను వేయించాలని అన్నారు. అనంతరం పెంపుడు కుక్కలకు టీకాలను వేశారు.