భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధభూమిలో భారతదేశం కోసం పోరాడి వీర మరణం పొందిన ఆంధ్రప్రదేశ్ వాసి మురళి నాయక్ గూడూరు పట్టణంలో శనివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ముందుగా మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.