గూడూరులో వృద్ధాశ్రమ గదుల ప్రారంభోత్సవం

55చూసినవారు
గూడూరులో వృద్ధాశ్రమ గదుల ప్రారంభోత్సవం
గూడూరు పట్టణంలోని ఓం శ్రీ వృద్ధాశ్రమంలో నిర్మించిన నూతన గదులను గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ శనివారం స్వయంగా ప్రారంభించారు. ఈ గదుల నిర్మాణాన్ని ఆయన తన స్వంత నిధులతో చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా ప్రగతి సేవా సంస్థ సభ్యుడినేనని, ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తన పూర్తి భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే నిజమైన మానవతా ధర్మమని పేర్కన్నారు.

సంబంధిత పోస్ట్