తిరుపతి జిల్లా గూడూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆప్కాస్ ను కొనసాగించాలని సి.ఐ.టి.యూ జిల్లా అధ్యక్షులు జి. బాల సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు గూడూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.