గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నియోజకవర్గంలో ప్రజలకు త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలని, బోర్లు, మోటార్లు రిపేర్లు ఉంటే చేయించాలని తెలిపారు. వాటర్ అందని గ్రామాలకు పైప్ లైన్లు వేయించాలని అన్నారు.