ఆరు వారాల పాటు ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కుప్పం మీదుగా గోరఖ్పూర్ వేసవి స్పెషల్ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు గురువారం స్పష్టం చేశారు. కాట్పడి, రేణిగుంట, విజయవాడ, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా గోరఖ్పూర్ చేరుకుంటుంది. మళ్ళీ అదే మార్గంలో తిరుగు ప్రయాణంలో సోమవారం సాయంత్రం 5. 40 గంటలకు కుప్పం మీదుగా కృష్ణరాజపురం చేరుకుంటుందని అధికారులు తెలిపారు.