కుప్పంలో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విద్యాసాగర్ గురువారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను అధినేత జగన్కు పంపించారు. పార్టీలో తనతో ఉన్న వారిని సస్పెండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్నా, ప్రజల కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.