సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో కంచర్ల రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానికులను నారా భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.