కుప్పం పట్టణంలో వెలసిన తిరుపతి గంగమాంబ అమ్మవారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు ఘన స్వాగతం అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.