చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీవీ డిబేట్లో మహిళలను కించపరడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వెంటనే సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలి వద్ద వైసీపీ అధినేత జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.