రామకుప్పం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పేద ప్రజలకు మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అని వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం రోగులను పరామర్శించి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.