కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తొలి మహిళ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం మొల్లమాంబ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి మొల్లమాంబ అనువదించారని కొనియాడారు.