చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలంలోని పీఎంకె తాండా ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పాఠశాల కమిటీ ఛైర్మన్ కృష్ణా నాయక్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు గ్రామస్థులు అన్ని విధాలుగా సహాయం అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని అన్నారు.