కుప్పం: ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం

75చూసినవారు
కుప్పం: ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం
కుప్పం నియోజక వర్గం శిగ లపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై 49 మంది మహిళలకు కుప్పం వ్యవసాయ అధికారి అమృతవల్లి ఆధ్వర్యంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బీజామృతం, ద్రవ జీవామృతం, ఘనజీవామృతం విత్తన గుళికలు చేయడం కషాయాలు తయారు చేసి చూపించడం వంటి శిక్షణ కార్యక్రమాలపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కుప్పం వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్