కుప్పం మున్సిపల్ పరిధిలోని ఆలయాలను టీడీపీ బోర్డు మెంబర్ శాంతారామ్, టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు మంగళవారం పరిశీలించారు. కుప్పం నియోజవర్గంలో 141 ఆలయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించామని టిటిడి బోర్డు మెంబర్ శాంతారామ్ స్పష్టం చేశారు. రానున్న బోర్డు సమావేశంలో అంచనాలను ఆమోదించి ఆలయాల అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.