కుప్పం పట్టణ పరిధిలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2: 30 గంటల వరకు విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ రెస్కో డిఈ ప్రభాకర్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. కుప్పం మండలం, గుడిపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తులు పనుల కారణంగా విద్యుత్ సరఫరా ఉండదని కావున వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.