కుప్పం మండలం అడవిబూదుగూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోడిగుడ్లు తీసుకువస్తానని చెప్పి సోమవారం బయటకు వెళ్లిన మురళి (30) బుధవారం గ్రామ శివారులోని బావిలో మృతదేహంగా తేలాడు. కుటుంబ సభ్యులు గాలింపు ప్రారంభించగా, బావిలో శవమై కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. రెండు నెలల క్రితమే తండ్రిని కోల్పోయిన కుటుంబంలో మళ్లీ శోకం అలమికింది. కేసు నమోదు చేసి కుప్పం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.