మదనపల్లి లోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి టెంకాయల మాలల అలంకరణలో మంగళవారం భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలమాలలు, తులసి మాలలతో, టెంకాయల మాలలతో అలంకరించారు. మాఘమాసం కావడంతో స్వామివారికి ప్రతిరోజు ఒక్కో విధంగా అలంకరణ చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.