అన్నమయ్య జిల్లా కురబలకోట నూతన తహశీల్దార్ గా గురువారం ధనుంజయులు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాలతో తహశీల్దార్ల బదిలీల భాగంగా గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ తహశీల్దార్ గా పని చేసిన తపస్విని నిమ్మనపల్లికి బదిలీ అయ్యారు. నూతనంగా విధుల్లో చేరిన తహశీల్దార్లను సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అలాగే తపస్వినికి వీడ్కోలు పలికారు.