మదనపల్లె మండలం వలసపల్లె గ్రానైట్ ఫ్యాక్టరీలో శనివారం ఓ కార్మికుడు గాయపడ్డాడు. బీహార్ రాష్ట్రంకు చెందిన అభిషేక్(23) బండలను పాలిష్ చేస్తుండగా ఒక గ్రానైట్ బండ ప్రమాదవశాత్తు కాళ్లపై పడింది. అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.