మదనపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష శుక్రవారం పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. తొక్కిసలాట జరగకుండా ఆలయ ఈఓ, పోలీసులతో చర్చలు జరిపారు. ఉదయం నుండి భక్తులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం పొందుతున్నారు.