అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం కోళ్ల బైళ్ళు గ్రామ పంచాయతీ బాబు కాలనీ నందు వాటర్ పైపులు పగిలి కాలువ నీళ్లు మొత్తం లీక్ కావడంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. గురువారం విషయం తెలుసుకున్న టీడీపీ ఇన్ ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు సకాలంలో స్పందించి వాటర్ పైపులను బాగు చేయడంతో బాబు కాలనీ ప్రజలు అభినందనలు తెలియజేశారు.