మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష స్వగృహంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలంలో ప్రజలు భూములు, త్రాగునీరు తదితర సమస్యలు పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు. స్పందించిన శాసనసభ్యులు వెంటనే ఆయా మండలాల తహసిల్దార్, మండల అభివృద్ధి అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.