పుత్తూరు మున్సిపాలిటీ నెత్తం దళితవాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త దొరస్వామి బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ దొరస్వామి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.