నగరి నియోజకవర్గం, వడమాల పేట మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఇందులో టీసీ అగ్రహారంకు చెందినటువంటి ఆర్. వెంకటేష్ కు రూ 61, 811, సి విజయ్ కి రూ 64, 415, టి మురగారెడ్డి కి రూ 20, 000 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సీఎం, ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.