నారావారిపల్లికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయంలో చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.