టీడీపీ నాయకుల సవాల్ స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. తిరుపతిలో భూమనకు మద్దతుగా గురువారం ఆమె రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్ స్వీకరించి దాని నిర్ధారించేందుకు సిద్ధమైన భూమనను అడ్డుకోవడం దారుణమన్నారు. టీడీపీ నాయకులే గోవులు మృతి చెందాయని చెబుతున్న సిగ్గు లేకుండా ఎలా సవాల్ చేస్తారని మండిపడ్డారు.